/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Telangana-State-New-Emblem.jpg)
New Emblem : తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం (Telangana State New Emblem) రూపకల్పన తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ కొత్త రాష్ట్ర చిహ్నం ఫోటో ఒకటి సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. అమరవీరుల ప్రతీకగా అమరవీరుల స్థూపాన్ని కొత్తగా రూపొందించిన లోగోలో పెట్టారు. కొత్త లోగో (Logo) లో అమరవీరుల స్తూపంతో పాటు వరి కంకులు ఉన్నాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్తో పాటు కొత్తగా హిందీ భాషలో తెలంగాణ ప్రభుత్వం రాసిన పదాలు కొత్త లోగోలో పొందుపరిచారు. పాత లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం ఉండేవి.
Telangana state new logo: Unofficial pic.twitter.com/RxKW7bUB5L
— Vijay Reddy (@vijay_reports) May 30, 2024
Also Read : నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి
కాగా కొత్త లోగోలో చార్మినార్తో పాటు కళాతోరణం తొలిగించారు. కాగా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్ (CM Revanth) కీలక సమావేశం నిర్వహించనున్నారు. పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర చిహ్నం, గీతంపై ప్రభుత్వ నిర్ణయాలను రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ వివరించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని సీఎం రేవంత్ కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు.