Chandrababu Naidu : మంగళగిరి వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌..5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!

ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. దీంతో మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్‌గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

New Update
Chandrababu Naidu : మంగళగిరి వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌..5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!

Andhra Pradesh : ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం (Oath Ceremony) చేయనున్నారు. తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు కార్యకర్తుల, అభిమానులు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం (Alliance Government) ఏర్పడడంతో అటు టీడీపీ (TDP) నేతలు, జనసేన (Janasena) నేతలు, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రమాణ స్వీకార సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఉదయం 6 గంటలకే సభా వేదిక వద్ద జనం కిక్కిరిసి పోయి ఉన్నారు.

ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్‌గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ ను క్లియర్‌ చేసేందుకు పోలీసులు కష్టపడుతున్నారు.

Also read: టీఎస్ టెట్‌ ఫలితాలు నేడు విడుద‌ల‌..!

Advertisment
Advertisment
తాజా కథనాలు