ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న ఏపీ పర్యాటకులు!

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌ లో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగిన వేరువేరు ఘటనల్లో సుమారు 31 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

New Update
ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న ఏపీ పర్యాటకులు!

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌ లో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగిన వేరువేరు ఘటనల్లో సుమారు 31 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

రాజధాని డెహ్రాడూన్ తో పాటు హిల్‌ స్టేట్ లోని ఐదు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్ ను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇదిలాఉంటే.. రెండురోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా అనేక మంది యాత్రికులు చిక్కుకుపోయారు. రుషికేశ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించాయి.

యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. కొడియాల వద్ద 1500 వాహనాలు, వేలాది మంది ప్రజలు నిలిచిపోయారు. వీరిలో బెంగళూరు, ఏపీ నుంచి వెళ్లిన పలువురు తెలుగు యాత్రికులు కూడా ఉన్నారు. వారంతా తిరుగు ప్రయాణంలో చిక్కుకున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా మంగళవారం పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

డెహ్రాడూన్ ప్రాంతంలో తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదు కావడంతో కొండచరియలు విరిగిపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గర్హ్వాల్, కుమావోన్ ప్రాంతాల్లోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర మార్గంలోని గౌరీకుండ్ సమీపంలో వరదలు సంభవించాయి.

Advertisment
తాజా కథనాలు