తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలు వరద నీటిలో జలదిగ్భందమయ్యాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నుంచి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న గ్రామాలు, పట్టణాలకే కాదు.. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే పైకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
పూర్తిగా చదవండి..Rains Effect: భారీ వర్షాల ఎఫెక్ట్: హైదరాబాద్-విజయవాడ హైవేపై నిలిచిన రాకపోకలు, భారీగా ట్రాఫిక్ జామ్
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై నుంచి మున్నేరు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో పోలీసులు..
Translate this News: