Harish Salve: రోజుకు 15లక్షలు.. చంద్రబాబు తరుఫు వాదిస్తున్న ఈ లాయర్‌ గురించి తెలుసుకుంటే షాక్‌ అవుతారు!

చంద్రబాబు తరుఫున ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో వాదిస్తున్న ప్రముఖ లాయర్‌ హరీశ్‌సాల్వేపైన తెలుగు రాష్ట్రాల్లో విపరీత చర్చ జరుగుతోంది. గతంలో జగన్‌ తరుఫున వాదించిన సాల్వే రోజుకు 15లక్షలు ఫీజ్‌ తీసుకునే న్యాయవాది. ఇప్పటికే చంద్రబాబు తరుఫున ముకుల్ రోహత్గీ, మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్, లూథ్రా వాదిస్తున్నారు. వీరందరికి జీతాలు ఇవ్వడానికి టీడీపీ కోట్లలోనే ఖర్చు చేస్తుందని అంచనా. ఇక ఇటివలి మూడో పెళ్లి చేసుకున్నారు సాల్వే. గతంలో కులభూషణ్ జాదవ్‌ కేసును ఒక్క రూపాయకే వాదించిన సాల్వే దేశంలో ధనవంతులైన లాయర్లలో ఒకరు.

Harish Salve: రోజుకు 15లక్షలు.. చంద్రబాబు తరుఫు వాదిస్తున్న ఈ లాయర్‌ గురించి తెలుసుకుంటే షాక్‌ అవుతారు!
New Update

Harish salve for chandrababu: ఒక్క రోజుకు 15 లక్షలు ఫీజ్‌.. అది కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి పెద్ద పెద్ద కోర్టుల్లోనే వాదించే లాయర్‌. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్ తీసుకురావడం కోసం దేశంలోని టాప్‌ లాయర్లు బరిలోకి దింపుతోంది టీడీపీ. ఇప్పటికే సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించగా.. తాజాగా మరో టాప్‌ లాయర్ హరీశ్‌ సాల్వే చంద్రబాబు తరుఫున వాదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆయన గురించే తెలుగు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటివలే మూడో పెళ్లి చేసుకోని వార్తల్లో నిలిచిన హరీశ్‌ సాల్వే ప్రస్తుతం చంద్రబాబు తరుఫున ఏసీబీ కోర్టులో వాదిస్తున్నారు.

గతంలో జగన్‌ తరుఫున వాదించిన వారే:
చంద్రబాబు తరుఫున ప్రస్తుతం వాదిస్తున్న లాయర్లు గతంలో జగన్‌ తరుఫున వాదించిన వారే కావడం విశేషం. చంద్రబాబు తన కేసులను హైకోర్టుతో పాటు ఏసీబీ కోర్టులో వాదించడానికి సుప్రీంకోర్టు నుంచి చాలా మంది న్యాయవాదులను నియమించుకున్నారు. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇప్పటికే నాయుడు తరపున వాదించగా, మరో ముగ్గురు న్యాయవాదులు - భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్‌ సాల్వే, మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ కూడా చంద్రబాబుకు సపోర్ట్‌గా బోర్డులోకి తీసుకున్నారు. ఈ లాయర్లందరూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి అనుకూలంగా వాదించారు.

publive-image గతంలో జగన్ తరుఫు వాదించిన సాల్వే

అప్పుడలా.. ఇప్పుడిలా:
2021లో, జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రవేశపెట్టాలనే తన చర్యను సమర్థించుకోవడానికి ముకుల్ రోహత్గీ సేవలను నియమించుకుంది. 2011లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన క్విడ్ ప్రోకో కేసులో దివంగత రామ్ జెఠ్మలానీతో పాటు రోహత్గీ కూడా సుప్రీంకోర్టులో జగన్ తరపున వాదించారు. అదేవిధంగా, క్విడ్ ప్రోకో కేసులో జగన్ తరపున హరీశ్‌ సాల్వే వాదించారు. 2013లో వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడికి బెయిల్ కోసం కూడా వాదించారు. నిజానికి అమరావతి భూ కుంభకోణం కేసులో రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై సాల్వే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించారు. 2011 నాటి ఇదే క్విడ్ ప్రోకో కేసుకు సంబంధించి జగన్ ప్రమోట్ చేసిన జగతి పబ్లికేషన్స్ తరపున మరో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ కూడా వాదించారు. ఇప్పుడు వీరంతా చంద్రబాబు తరుఫున బరిలోకి దిగడం హాట్‌ టాపిక్‌గా మారింది.

publive-image కులభూషణ్ జాదవ్‌ తరుఫున ఒక్క రూపాయికి వాదించిన సాల్వే

హరీశ్‌ సాల్వే ఫీజ్‌:
అనేక మీడియా నివేదికల ప్రకారం, హరీశ్‌ సాల్వే నికర విలువ దాదాపు రూ. 50 కోట్ల నుంచి రూ. 70 కోట్లు. హరీశ్‌ సాల్వే ఒక్క రోజు ఫీజు దాదాపు రూ. 15 లక్షలు. దేశంలోని అత్యంత సంపన్న న్యాయవాదులలో సాల్వే ఒకరు. నవంబర్ 1, 1999 నుంచి నవంబర్ 3, 2002 వరకు దేశ సొలిసిటర్ జనరల్ పదవిని కలిగి ఉన్నారు. అయితే ఇంత భారీ మొత్తంలో ఫీజ్‌ తీసుకునే హరీశ్‌ సాల్వే ఒక కేసుకు మాత్రం కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకోని వాదించారు. దేశపు అగ్రశ్రేణి న్యాయవాదుల్లో ఒకరైన హరీశ్‌ సాల్వే.. భారత జాతీయుడు కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ)లో పోరాడటానికి కేవలం ఒక్క రూపాయనే ఫీజ్‌గా తీసుకున్నారు.

publive-image త్రినాతో సాల్వే పెళ్లి

మూడు పెళ్లిళ్లు:
దేశంలోని ప్రముఖ లాయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న హరీశ్‌సాల్వే కెరీర్‌ పరంగానే కాకుండా పర్శనల్‌ లైఫ్‌లోనూ టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగానే నిలిచిపోయారు. 68ఏళ్ల వయసులో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సెప్టెంబర్ 3న, నీతా అంబానీ, లలిత్ మోదీ, మొయిన్ ఖురేషీ లాంటి ప్రముఖల మధ్య సాల్వే మూడో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుక లండన్‌లో జరిగింది. త్రినాని సాల్వే వివాహం చేసుకున్నారు. హరీశ్‌ సాల్వే మొదట మీనాక్షి సాల్వేను వివాహం చేసుకున్నారు. వారి వివాహం 38 సంవత్సరాల పాటు కొనసాగింది. జూన్ 2020లో మీనాక్షికి విడాకులు ఇచ్చారు. తర్వాత లండన్‌కు చెందిన కళాకారిణి అయిన కరోలిన్ బ్రోస్సార్డ్‌ను అక్టోబర్ 28, 2020న వివాహం చేసుకున్నారు. మొదటిసారిగా ఒక ఆర్ట్ ఈవెంట్‌లో బ్రోసార్డ్‌ని కలిశారు సాల్వే. మొదటి వివాహం నుంచి ఆయనకు ఇద్దరు కుమార్తెలు, సాక్షి, సానియా ఉండగా.. ఇటివలే మూడో సారి పెళ్లి చేసుకున్నారు.

ALSO READ: సున్నితమైన అంశాలపై చిత్ర పరిశ్రమ స్పందించదు.. చంద్రబాబు అరెస్టుపై సురేష్‌బాబు క్లారిటీ

#ap-skill-development-case #harish-salve
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe