Telangana: హరీష్ రావు మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు.. రేవంత్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును చూస్తే ఔరంగజేబులా కనిపిస్తున్నాడని సీఎం రేవంత్ అన్నారు. 'సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుది. నువ్వు రాజీనామా చెయ్.. నేను చేసి చూపిస్తా అని హరీష్ అంటుండు. పదేళ్లు మంత్రిగా ఉండి హరీష్ ఏం చేశారు?' అని ప్రశ్నించారు.

Telangana: హరీష్ రావు మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు.. రేవంత్
New Update

Telangana: ఉద్యోగ నియామకాల విషయంలో బీఆరెస్ (BRS) పదేళ్లు నిర్లక్ష్యం వహించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ (Cm Revanth) రెడ్డి అన్నారు. అంతేకాదు బీఆర్ఎస్ వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని కానిస్టేబుల్ నియమకాలకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు 30లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నామని, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే త్వరలోనే గ్రూప్ 1 పరీక్షను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని ఆరోపించారు.

నువ్వు రాజీనామా చెయ్..

ఈ మేరకు అసెంబ్లీలో హారీష్ రావు వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మాట్లాడిన రేవంత్.. నువ్వు రాజీనామా చెయ్.. నేను చేసి చూపిస్తా అని హరీష్ అంటుండు. హరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుది. పదేళ్లు మంత్రిగా ఉండి హరీష్ ఏం చేశారు? మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిండ్రు. దశ బాగుంటే దిశతో పని లేదు. ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలి. 3,650 రోజులు అధికారంలో ఉండి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? మా ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టాం. ఇది మీ కళ్లకు కనిపించడం లేదా? మీరు రితాళ్లు కట్టుకుని వేలాడినా.. ఇంకేం చేసినా.. ప్రజలు మీపై సానుభూతి చూపరు. బీఆరెస్ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: CAG Report On Telangana Revenue: తెలంగాణలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత లేదు.. కాగ్ నివేదిక

విద్యను దూరం చేయాలనే కుట్రతోనే..

అలాగే పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే గత ప్రభుత్వం పాఠశాలలు మూసేసింది. త్వరలో మెగా డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటాం. గురుకుల పాఠశాలలన్నీ ఒకే గొడుకు కిందకు తీసుకోస్తాం. 20ఎకరాల్లో ఒకే క్యాంపస్ లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. కొడంగల్ లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం. ఈ మోడల్ ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తాం. అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావాల్సిన స్థలాలను సేకరించాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన వివరించారు.

#aurangzeb #harish-rao #cm-revanth
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe