AP: లేడీ కిల్లర్స్.. అప్పు తీసుకుంటారు, అడిగితే చంపేస్తారు..!

గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఓ మహిళ అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు మహిళలు అప్పు తీసుకొని.. మళ్లీ అడిగితే కూల్‌డ్రింక్‌లో సైనైడ్ కలిపి చంపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 4 హత్యలు, 3 హత్యాయత్నాలు చేసిన లేడీ కిల్లర్స్ ను అరెస్టు చేశారు.

AP: లేడీ కిల్లర్స్.. అప్పు తీసుకుంటారు, అడిగితే చంపేస్తారు..!
New Update

Guntur: గుంటూరు జిల్లాలో మహిళా సైనైడ్ కిల్లర్స్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వడ్లమూడిలో నాగూర్‌ బీని అనే మహిళ జూన్ నెలలో అనుమానాస్పదంగా మృతి చెందగా పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, కేసు విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. ముగ్గురు లేడీ కిలర్స్ అప్పు తీసుకుని, అడిగితే చంపేస్తారని దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి.

Also Read: ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయకండి.. వైసీపీకి పురంధేశ్వరి వార్నింగ్..!

నాగూర్‌ బీని నుంచి అప్పు తీసుకున్న ముగ్గురు కిలాడీ లేడీలు ఆమె అప్పు అడిగినందుకు బ్రీజర్‌లో సైనెడ్ కలిపి చంపేసినట్లు గుర్తించారు. ఇలా మరో నాలుగు హత్యలు చేసినట్లు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు మునగప్ప రజని, ముడియాల వెంకటేశ్వరి, గొంతు రమణమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: నేను చనిపోతున్నా.. పెళ్లయిన 20 రోజులకే చేతిపై రాసుకొని..!

గతంలో కంబోడియా వెళ్లొచ్చిన ప్రధాన నిందితురాలు వెంకటేశ్వరి అక్కడ పలు నేరాల్లో పాల్గొన్నట్టుగా అధికారులు గుర్తించారు.
నిందితుల్లో మరొకరు వాలంటీర్‌గా పనిచేశారు. ముగ్గురు నిందితులు రెండేళ్లలో 4 హత్యలు, 3 హత్యాయత్నాలు చేశారని అది కూడా ఆ హత్యలను ఒకే స్టైల్‌లో చేసినట్లు తెలుస్తుంది. ఈ గ్యాంగ్‌కి సైనైడ్ అమ్మిన వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యారు.

#guntur #ap-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి