Telangana : ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం

ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం నాటికి ముగిసింది. మే 27న ఈ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 5న కౌంటింగ్ నిర్వహిస్తారు.

New Update
National: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక

MLC By Poll : ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ (Khammam-Nalgonda-Warangal) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు (MLC Elections) ఈ నెల 27న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాటికి ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ (Polling) జరగనుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ (BRS) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది.

Also Read: గూగుల్ మ్యాప్‌ని నమ్మి.. నట్టేట మునిగారు..!

ఈ ఎన్నికల్లో 4.63 లక్షల మంది పట్టభద్రులు (Graduates) ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జూన్ 5న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. మరి ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Also Read: 2024-25 విద్యా సంవత్సరం క్యాలెండర్‌ విడుదల.. సెలవులు, పరీక్షలు ఎప్పుడంటే

Advertisment
తాజా కథనాలు