Telangana Elections: కేసీఆర్‌ రాజీనామా లేఖను ఆమోదించిన గవర్నర్

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓటమిపాలు కావడంతో.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్‌ ఆమోదించినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్‌ సూచించినట్లు తెలుస్తోంది.

New Update
KCR: ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం.. డేట్స్ ఫిక్స్

సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్‌ ఓడిపోయిన నేపథ్యంలో కేసీఆర్‌ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. అయితే కేసీఆర్‌ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్‌ సూచించినట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ 64 సీట్లు గెలుచుకుంది. అయితే సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Also read: రేవంత్ రెడ్డిని సీఎం కానిస్తారా!.. నెక్స్ట్ ఆప్షన్స్ ఇవే

Advertisment
తాజా కథనాలు