Hyderabad: కూకట్‌పల్లిలో ట్రక్ బీభత్సం.. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టి

హైదరాబాద్ కూకట్‌పల్లిలో గ్రూడ్స్ ట్రక్ బీభత్సం సృష్టించింది. వసంత నగర్ రోడ్డుపై ఓ మూల మలుపులో అతివేగంగా వచ్చిన ఆటో అదుపుతప్పి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీ కొట్టింది. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Hyderabad: కూకట్‌పల్లిలో ట్రక్ బీభత్సం.. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టి
New Update

Kukatpally: హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ఇప్పటికే పంజాగుట్టలో శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించగా.. పాత బస్తీలో స్టంటర్ శ్రీకాంత్ దుర్మరణం పాలయ్యాడు. అయితే ఈ రెండు ఘటనల నుంచి జనాలు బయటపడకముందే టర్నింగ్ వద్ద అతివేగంగా వచ్చిన ఓ ట్రక్ అమాయకురాలి ప్రాణాలను బలితీసుకున్న సంఘటన కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. స్థానిక కిరాణ షాపు సీసీ టీవీ పుటేజీలో రికార్డు అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గ్రూడ్స్ ట్రక్ అతివేగం..

ఈ మేరకు కూకట్‌పల్లి- వసంత నగర్ రోడ్డుపై ఓ మహిళా నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెతో పాటు అదే రోడ్డుపై పలువురు బైక్‌లపై వెళ్తున్నారు. అయితే అక్కడ మూల ములపునుంచి ఓ గ్రూడ్స్ ట్రక్ అతివేగంగా దూసుకొచ్చింది. టర్నింగ్ లో కంట్రోల్ తప్పిన వాహనం రోడ్డుకు ఆ చివరన వెళ్తున్న మహిళను ఢీ కొట్టింది.

మహిళ మృతి..

ఆ తర్వాత అదే వేగంతో వెళ్లి పక్కనున్న గొడకు ఆనుకుని లెఫ్ట్ సైడ్ పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఆమె తలకు ఆటో బలంగా తగలడంతో అక్కడే పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే సదరు మహిళను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

#accident #women-walker #goods-truck #kukatpally
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe