17 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్.. నమ్మించి మోసం చేసిన స్నేహితుడు

17ఏళ్ల దళిత బాలికను గ్యాంగ్ రేప్ చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ యువకుడు ఆమెను నమ్మించి కారులో అటవి ప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత అతని స్నేహితులు కూడా బాలికపై సమూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

New Update
17 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్.. నమ్మించి మోసం చేసిన స్నేహితుడు

సోషల్ మీడియాలో పరిచయమైన స్నేహం ఓ బాలిక జీవితం నాశనం చేసింది. కొంతకాలంపాటు మంచి ఫ్రెండ్ గా నమ్మించిన ఓ యువకుడు చివరికి తనలో దాగివున్న వక్రబుద్ధి బయటపెట్టాడు. పార్టీ పేరుతో మాయమాటలు చెప్పి ఆమెను ఒంటరిగా బటయకు తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. ఫలితంగా మరికొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి ఆ మైనర్ అమ్మాయిపై లైంగిక దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బయటకు చెప్పొద్దని బెదిరింపులకు దిగారు. ఈ ఘోరమైన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఈ మేరకు మధ్యప్రదేశ్​గ్వాలియర్​పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన నవంబర్ 21న జరిగింది. ఓ 17ఏళ్ల దళిత బాలికకు ఏడాది క్రితం ఓ వ్యక్తి, సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. అతడిని నమ్మింది. దీనినే ఆ వ్యక్తి అడ్వాంటేజ్​గా తీసుకున్నాడు. కలుద్దామని చెప్పి, బాలికను పిలిపించాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ఆమె వద్దకు వెళ్లాడు. ఆమెను కూడా కారులో ఎక్కించుకుని, ఎవరూ లేని అటవీ ప్రాంతంవైపు తీసుకెళ్లారు. అక్కడే మొదట ఆ యువకుడు ఆమెను రేప్ చేశాడు. ఆ తర్వాత ఆ మిగిలిన ముగ్గురు కూడా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ దారుణం గురించి నాలుగు రోజుల తర్వాతే పోలీసులకు తెలిసింది. ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితులు చెప్పడం, వారిలో ఒకరు రాజకీయ నేత బంధువు కావడంతో తనకు జరిగిన విషయాన్ని బయటకు చెప్పేందుకు బాధితురాలు భయపడింది. చివరికి ధైర్యం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో ఇంకా ఎవరిని అరెస్ట్​ చేయలేదని, పూర్తి వివరాలు సేకరించిన తర్వాత నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు