Health Tips: మధుమేహాన్ని ఇలా కూడా తగ్గించుకోవచ్చా..ఇవి మీరూ ట్రై చేయండి

షుగర్‌ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధిని సరిగా నియంత్రణలో ఉంచుకోకపోతే మన శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం చూపుతుంది. మొలకెత్తిన గింజలు,మొలకెత్తిన శెనగలు, శెనగలతో చేసిన కూర తింటే షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

New Update
Health Tips: మధుమేహాన్ని ఇలా కూడా తగ్గించుకోవచ్చా..ఇవి మీరూ ట్రై చేయండి

Health Tips: షుగర్‌ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ప్రత్యేకమైన వంటకాలు తీసుకోవాలి. మధుమేహం అనేది వంశపారంపర్య వ్యాధి, అలాగే జీవనశైలిలో కొన్ని మార్పుల వల్ల కూడా సంభవించవచ్చు. ఈ వ్యాధిని సరిగా నియంత్రణలో ఉంచుకోకపోతే మన శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం చూపుతుంది. మధుమేహం ఎప్పుడూ కంట్రోల్‌లో ఉండాలంటే ఆహారం, వ్యాయామం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

షుగర్‌ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?:

  • షుగర్‌ ఉన్నవారు ఫుడ్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏయే ఆహారాలు తీసుకోవచ్చో, ఏవి తినకూడదో ఒక అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. పాయసం, పప్పు, సీఫుడ్, కొన్ని రకాల పండ్లు, పాపడ్‌లు నాన్‌వెజ్ కూరలు తినే వారు చాలా మంది ఉన్నారు. ఆవిరిపై ఉండికించిన ఆహారం ఏది తిన్నా మధుమేహం ఉన్నవారికి అది ప్రయోజనంగా ఉంటుంది.

రాగి:

  • మధుమేహం ఉన్నవారు అన్నం ఎక్కువగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారు రాగులు, మొక్కజొన్న పిండి కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. లేదా బియ్యపు పిండిని కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఆహారంలో ఓట్స్‌ని తీసుకోవచ్చు. అన్నం మినహా ఏది తిన్నా మధుమేహం ఉన్నవారికి ఆరోగ్యకరంగానే ఉంటుంది. మధుమేహానికి బియ్యం సాధారణంగా మంచిది కాదు. కానీ మీరు వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్‌ని కూడా వాడుకోవచ్చు. బ్రౌన్‌ రైస్‌లో కూరగాయలు కలిపి తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. దుంపలు, క్యారెట్లు కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిలో కొద్దిగా కొబ్బరిని కలిపితే రుచితో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కూరగాయలతో పాటు ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం షుగర్‌ ఉన్నవారికి ఎంతో ఉపయోగకరం. ఫైబర్‌ అనేది కడుపు నిండిన భావన కలిగి ఎక్కువగా తినకుండా ఉంటారు. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది.

వేరుశెనగ:

  • మొలకెత్తిన గింజలను తినడం కూడా మధుమేహం ఉన్నవారికి ఎంతో మంచిది. మొలకెత్తిన శెనగలు, శెనగలతో చేసిన కూర తిన్నా కూడా షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. పప్పులకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా డయాబెటిక్ రోగులకు అరటిపండ్లు చాలా మేలు చేస్తాయి. కాకపోతే మితంగా తింటే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: పొరపాటున ఫస్ట్‌నైట్‌ వీడియో లీక్‌..సోషల్‌ మీడియాలో వైరల్‌

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు