Yadadri: యాదాద్రి స్వామివారిని దర్శించుకున్న హీరో విజయ్ దేవరకొండ

ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు (Movie celebrities) కూడా స్వామివారిని దర్శించుకున్నారు. సినీ నటుడు విజయ్ దేవరకొండ ( Film actor Vijay Deverakonda) యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో సందడి చేశారు.

Yadadri: యాదాద్రి స్వామివారిని దర్శించుకున్న హీరో విజయ్ దేవరకొండ
New Update

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సినీ హీరో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరితోపాటు ఖుషి మూవీ( Khushi movie) టీం కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రంలో పంచ కట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. హీరో దేవరకొండను చూసేందుకు పలువురు అభిమానులు తరలి వచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాలను చూస్తూ ఆయన దేవుడి దర్శనానికి వెళ్లారు. ఆలయ కొండపైకి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అంతేకాకుండా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక ఇవాళ బిగ్ బాస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ (Big Boss) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా గర్తు చేయాల్సి పనిలేదు. ఆరు (Six) సీజన్లను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 3న అంటే (నేడు) 7డో సీజన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ షో ప్రారంభంకానున్నది. ఇక ఈ కార్యక్రమానికి రౌడీ స్టార్ ది విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌లుగా వస్తున్నారు.

ఇక సౌతిండియా స్టార్ హీరోయిన్ సమంత ( star heroine is Samantha), విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ఖుషి ( Khushi movie). ఈ మూవీని ప్రముఖ నిర్మాణ ఎర్నేని నవీన్ (Naveen), యలమంచిలి రవిశంకర్ (Ravi Shankar) నిర్మించారు. ఈ చిత్రానికి శివ (Shiva) నిర్వాణ డైరెక్షన్ (Directed) చేశారు. ఈ ఖుషి మూవీ మొదటి రోజు రికార్డు సృష్టించింది. వంద కోట్ల బడ్జెట్‌ (One hundred crore budget)తో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించగా.. ప్రమోషన్‌ పరంగా బజ్ క్రియేట్ చేయడంతో ఈ మూవీకి బిజినెస్ (Business) భారీగా వచ్చింది.

#khushi-movie-team #yadadri-bhuvanagiri-khushi-movie #yadadri-sri-lakshminarasimhaswamy #film-actor #vijay-devarakonda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి