Khammam: అయ్యా నాభూమి నాకు ఇప్పించండి.. ఖమ్మంలో మరో రైతు ఆత్మహత్యాయత్నం

సింగరేణి మండలంలోని ఉసిరికాయపల్లి లో భద్రయ్య అనే రైతు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన పొలాన్ని మరిపెడ బంగ్లాకు చెందిన ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ అక్రమంగా కబ్జా చేశాడని మనస్థాపం చెంది తన పొలంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

Khammam: అయ్యా నాభూమి నాకు ఇప్పించండి.. ఖమ్మంలో మరో రైతు ఆత్మహత్యాయత్నం
New Update

Khammam Farmer: ఖమ్మం జిల్లాలో చింతకాని మండలంలో ప్రభాకర్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంకా మరువక ముందే మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఘటన జరిగింది. సింగరేణి మండలంలోని ఉసిరికాయపల్లి లో భద్రయ్య అనే రైతు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

మండలంలోని ఉసిరికాయ పల్లి లో పచ్చిపాల భద్రయ్య అనేరైతు పొలాన్ని మరిపెడ బంగ్లాకు చెందిన ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ అక్రమంగా కబ్జా చేశాడని మనస్థాపం చెంది తన పొలంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం భద్రయ్య ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.భద్రయ్య భార్య భాగ్యమ్మ ఫిర్యాధు మేరకు కారేపల్లి పోలీస్ స్టేషన్లో కేసునమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: రిషి సునక్‌ ఓటమి… కేవలం 410 సీట్లే..చరిత్రాత్మక తీర్పునిచ్చిన ప్రజలు!

#telangana #farmer #khammam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe