అధికార పార్టీపై తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి(kishanreddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ మీద అదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు చాలా బాధకరం మని..ఆది ఆయన వ్యక్తిగతం విషయం అని అన్నారు. బీజేపీ పార్టీ లంబాడీ(st)సామాజిక వర్గం రిజర్వేషన్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే లంబాడీలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని కిషన్రెడ్డి వివరించారు. జనాభాకు అనుకూలంగా గిరిజన రిజర్వేషన్లను పెంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్న ఆయన గిరిజన రిజర్వేషన్లను మత రిజర్వేషన్లతో ముడి పెడుతూ.. రాజకీయం చేస్తున్న బీఅర్ఎస్కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పూర్తిగా చదవండి..కుటుంబ పెత్తనం పోవాలి..బీజేపీ వైపు ప్రజల చూపు: కిషన్రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీబీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో కుటుంబ పాలన పోయి.. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కిషన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్పై నిరంతరం పోరాటం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని కిషన్రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ర్యాలీలో పాల్గొనేందుకు మహబూబ్నగర్ వెళ్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి శంషాబాద్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
Translate this News: