Praneeth Rao : మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్.. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్!

ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు తరలించారు. పంజాగుట్ట పీఎస్‌లో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నాంపల్లికోర్టులో హాజరుపరుచనున్నారు.

New Update
Telangana: ప్రణీత్ రావ్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

Punjagutta : రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla) జిల్లా సిరిసిల్లలో మాజీ DSP ప్రణీత్ రావు(DSP Praneeth Rao) ను పంజాగుట్ట పోలీసులు(Punjagutta Police) అరెస్ట్ చేశారు. మూడు రోజులుగా అయన నివాసం వద్ద రెక్కి నిర్వహించి ప్రణీత్ రావును పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణం శ్రీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మాజీ DSP ప్రణీత్ రావును మంగళవారం రాత్రి 11 గంటలకు అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసి ఆధారాలు లేకుండా చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఏం జరిగిందంటే?
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) చేశారనే ఆరోపణలు ప్రణీత్ రావు పై ఉన్నాయి. దీనిపై కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన్ను విధుల్లో నుంచి తప్పించింది రేవంత్ సర్కార్. అయితే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు అంశంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబీలోని ఎస్ఓటి టీంలో కీలకంగా ఆయన వ్యవహరించారు. ఎస్ఐబీ(SIB) ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. 42 హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు తగులబెట్టినట్లు నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓటి లాకర్ రూంలోని ఫైల్స్ మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసు శాఖ గుర్తించింది. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా నాశనం చేసినట్లు గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. హెచ్ డీడీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది.

ఇక, నేరపూరితమైన కుట్రలో భాగంగానే ఫైల్స్ ను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు తేల్చారు. డేటాబేస్‌లోని మొత్తం డేటాను ప్రణీత్ రిమూవ్ చేసినట్లు గుర్తించారు. ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి.. రికార్డులను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు తేలింది. అయితే ప్రణీత్ రావు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ డీఎస్పీగా పనిచేస్తూ దాదాపు 30 మంది పోలీసు సిబ్బందితో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉండగా రూల్స్ అతిక్రమించినట్లు తేలగా ఆయనపై గతంలో సస్పెన్షన్ వేటు పడింది.

Also Read : బంగారం ధరల పెరుగుదల ఆగినట్టేనా.. ఈరోజు ఎంత ఉందంటే..

Advertisment
తాజా కథనాలు