EX MLA Jeevan Reddy: తల్లి పాలు తాగి రొమ్మును గుద్దేటోళ్లు.. RTVలో రెచ్చిపోయిన జీవన్ రెడ్డి

కాంగ్రెస్‌లో చేరిన రంజిత్ రెడ్డి, కడియం, కేకే, దానంపై నిప్పులు చెరిగారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వారంతా తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే రకం అని ఫైర్ అయ్యారు. రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా వీళ్ళు వెన్నుపోటు పొడుస్తారని అన్నారు.

New Update
EX MLA Jeevan Reddy: తల్లి పాలు తాగి రొమ్మును గుద్దేటోళ్లు.. RTVలో రెచ్చిపోయిన జీవన్ రెడ్డి

EX MLA Jeevan Reddy: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన రంజిత్ రెడ్డి, కడియం, కేకే, దానం పై నిప్పులు చెరిగారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వారంతా తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే రకం అని ఫైర్ అయ్యారు. రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా వీళ్ళు వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. కోడిగుడ్లు అమ్ముకునే వ్యక్తిని తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి.. పార్లమెంట్ కు పంపిస్తే.. పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో పదవుల కోసం పార్టీని వీడడం దారుణమని ఫైర్ అయ్యారు.

ఇక కడియం శ్రీహరి కూడా తన కూతురు కోసం పార్టీ మారారని అన్నారు. కడియం కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చిన ఘనుడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఉద్యమంలో పాల్గొనలేకపోయిన, ప్రజల్లో ఎన్నడూ లేకపోయినా కేవలం కడియం శ్రీహరి అడిగారని... కేసీఆర్ పార్టీ క్యాడర్ ను పక్కకి పెట్టి టికెట్ ఇస్తే వీళ్లు చివరికి చేసింది ఏంటి?.. కేసీఆర్ గుండెల మీద తన్ని కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ తో సరిసమానంగా పదవులు అనుభవించిన కేకే కి ఏమైంది?. 84 ఏళ్ల వయసులో పార్టీ మారడం ఎందుకు?. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ పక్కన ఉండే ఒకే ఓ వ్యక్తి అని కేవలం పదవుల కోసం పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహం ఏంటి?, కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ అరెస్ట్, కాళేశ్వరం స్కాం ఇలాంటి సంచలన విషయాలపై ఆర్టీవీ అన్‌సెన్సార్డ్ లో క్లారిటీ ఇచ్చారు జీవన్ రెడ్డి. పూర్తి ఇంటర్వ్యూను కింది వీడియోలో చూడండి.

Advertisment
తాజా కథనాలు