CM Revanth Reddy: సబితక్క నన్ను మోసం చేసింది: సీఎం రేవంత్ రెడ్డి

TG: మాజీ మంత్రి సబిత తనను మోసం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అవకాశమిస్తే తనకు మద్దతు ఇస్తానని చెప్పి మంత్రి పదవి కోసం సబిత బీఆర్ఎస్‌లో చేరారని అన్నారు. తనను ఓడగొట్టేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.

New Update
CM Revanth Reddy: సబితక్క నన్ను మోసం చేసింది: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: రేవంత్‌రెడ్డి నన్ను ఎందుకు టార్గెట్‌ చేశారు అని అసెంబ్లీ ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి సంతోషంగా ఆహ్వానించానని చెప్పారు. రేవంత్‌రెడ్డికి తనపై ఎందుకు కక్ష? అని అడిగారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆశా కిరణం అవుతావని చెప్పాను రేవంత్ కు ఆనాడు చెప్పానని అన్నారు. సీఎం అవుతావని కూడా చెప్పానని పేర్కొన్నారు. మనస్ఫూర్తిగా రేవంత్‌రెడ్డిని ఆశీర్వదించునట్లు తెలిపారు.

సబితక్క నన్ను మోసం చేసింది: సీఎం రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను సబితక్క కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మాట వస్తామనేని.. తాను కూడా సబితక్కాను సొంత అక్కలాగా అనుకున్నానని చెప్పారు. కొడంగల్ తాను ఎమ్మెల్యేగా ఓటమి చెందిన తరువాత.. కాంగ్రెస్ హైకమాండ్ తనను మల్కాజ్ గిరి ఎంపీ గా పోటీ చేసే అవకాశం కల్పించిందని.. ఆరోజు సబితక్క దగ్గరికి వెళ్లి మద్దతు తెలపాలని కోరగా.. సబితక్క తనకు మద్దతు ఇస్తానని చెప్పి మాట తప్పిందని అన్నారు. కేసీఆర్ మాయ మాటలను నమ్మి ఆనాడు టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొందిందని అన్నారు. తన ఓటమికి మాజీ మంత్రి సబితా ప్రయత్నించిందని చెప్పారు.


Advertisment
తాజా కథనాలు