T20 World Cup 2024: డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే.. జోఫ్రా రీ ఎంట్రీ!

డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ బరిలో దిగబోయే తుది జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌ను జోస్ బట్లర్ ముందుండి నడిపించనున్నాడు. గాయం కారణంగా కొన్ని నెలలు ఆటకు దూరమైన జోఫ్రా అర్చర్ రీ ఎంట్రీ ఇచ్చాడు.

New Update
T20 World Cup 2024: డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే.. జోఫ్రా రీ ఎంట్రీ!

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 జూన్‌ 2 నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మెగా టోర్నీ కోసం భారత్ తో పాటు మరిన్ని దేశాలు తమ జట్లను దాదాపు ఖరారు చేశాయి. అయితే తాజాగా పొట్టి కప్ సమరంలోకి దిగబోయే గెలుపు గుర్రాల లిస్ట్ ఇంగ్లాండ్ రిలీజ్ చేసింది.

జోఫ్రా అర్చర్ రీ ఎంట్రీ..
ఈ మేరకు జూన్‌ 2 నుంచి యూఎస్ఏ, వెస్టిండీస్‌ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుండగా.. ఇప్పటికే న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించాయి. అయితే డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఇంగ్లాండ్‌ను జోస్ బట్లర్ ముందుండి నడిపించనున్నాడు. గాయం కారణంగా కొన్ని నెలలుగా ఆటకు దూరమైన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇది కూడా చదవండి: Airports: ఇండియాలోని 24 విమానాశ్రయాలకు ఉగ్ర ముప్పు.. ‘టెర్రరైజర్స్ 111’ నుంచి మెయిల్!

ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, జోఫ్రా అర్చర్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.

Advertisment
తాజా కథనాలు