AP: మాధురి మంచిది.. ఆమెను వదలను.. భర్త సంచలన కామెంట్స్!

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్-వాణి-మాధురి వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన భార్య మాధురికి భర్త మహేష్‌ చంద్రబోస్ మద్దతుగా నిలిచారు. రాజకీయాల్లో ఎదుగుతుందనే మాధురిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మాధురిపై ఎవరు ఎన్ని చెప్పినా తాను పట్టించుకోనని, మాధురిని వదలనన్నారు.

New Update
AP: మాధురి మంచిది.. ఆమెను వదలను.. భర్త సంచలన కామెంట్స్!

MLC Duvvada Srinivas Issue: ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన భార్య మాధురికి (Divvala Madhuri) భర్త మహేష్‌ చంద్రబోస్ (Mahesh Chandrabose) మద్దతుగా నిలిచారు. రాజకీయాల్లో ఎదుగుతుందనే మాధురిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఓ టీవీ ఛానల్ లో ఆయన మాట్లాడుతూ.. మాధురిపై ఎవరు ఎన్ని చెప్పినా తాను పట్టించుకోనని, మాధురిని వదలనని అన్నారు. తన భార్యను రాజకీయాల్లోకి తీసుకెళ్లిందే వాణినేని భర్త దివ్వల మహేష్ స్పష్టం చేశారు. తనకు ఇష్టం లేకపోయినా మధురిని రాజకీయాల్లోకి పంపించానన్నారు. మాధరిపై తనకు నమ్మకం ఉందన్నారు.

Also Read: టీడీపీ కీలక నిర్ణయం.. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీకి దూరం

ఇదిలా ఉంటే మరోవైపు దువ్వాడ శ్రీనివాస్‌, వాణి (Vani) మధ్య రోజురోజుకూ వివాదం ముదురుతుండడంతో దువ్వాడ శ్రీనివాస్‌, వాణి బంధువులు రంగంలోకి దిగారు. బంధువుల సమక్షంలో ఇరువురి కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. వాణి డిమాండ్లు ఏంటో తెలుసుకున్నారు. డిమాండ్లపై కుమార్తెలు, తల్లిదండ్రులతో వాణి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. చర్చల ద్వారా వివాదానికి ముగింపు పలకాలని బంధువులు ఇరువురికి సూచించారు.

Also Read: మస్తాన్‌ ఫోన్‌లో అమ్మాయిల న్యూడ్‌ వీడియోలు.. బెడ్‌రూమ్‌లో కెమెరాలు పెట్టి!

అయితే, దువ్వాడ శ్రీనివాస్‌, వాణి మధ్య రాజీ కుదరని పరిస్థితి కనిపిస్తోంది. ఐదు డిమాండ్లను బంధువుల ముందుంచిన వాణి.. ఆ డిమాండ్లను పరిష్కరిస్తేనే రాజీ అంటున్నట్లు తెలుస్తుంది. అయితే, భర్త దువ్వాడ శ్రీను మాత్రం తన ఇల్లు తప్ప అన్నీ ఇచ్చేస్తానంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై నిన్న రాత్రి వరకు వాణి తన కటుంబ సభ్యులతో చర్చలు కొనసాగించారు. వాణి వైపు నుంచి ఆమె సిస్టర్స్ రేఖ, రాధ.. దువ్వాడ శ్రీను వైపు నుండి సోదరుడు శ్రీధర్ చర్చలు జరిపారు. వాణి డిమాండ్లపై ఇవాళ చర్చించే అవకాశం కనిపిస్తుంది. కాగా, దువ్వాడ ఇంటి దగ్గర వాణి నిరసన ఇంకా కొనసాగుతుంది.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Journalist Accreditation : జర్నలిస్టుల అక్రిడేషన్‌ మరో మూడు నెలలు పొడిగింపు

ఏపీ జర్నలిస్టుల అక్రిడేషన్‌ను మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కార్డుల జారీ చేసేంతవరకు లేదా ఆగస్టు31 వరకు ఏది ముందైతే  అప్పటివరకు పొడిగింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

New Update
AP Journalist Accreditation

AP Journalist Accreditation

AP Journalist Accreditation:  ఏపీ జర్నలిస్టుల అక్రిడేషన్‌ను మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కార్డుల జారీ చేసేంతవరకు లేదా ఆగస్టు31 వరకు ఏది ముందైతే  అప్పటివరకు పొడిగింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

Also Read: Shock To Trump: ట్రంప్ టారీఫ్ లకు యూఎస్ ఫెడరల్ కోర్ట్ బ్రేక్..

జర్నలిస్టులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జారీ చేయాల్సిన అక్రిడేషన్‌ ను మరోసారి పొడిగిస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌ హిమాన్షు శుక్ల  ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి అక్రిడేషన్‌ ముగిసి ఏడాది గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారటం, గతంలో ఇబ్బడిముబ్బడిగా జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీచేశారనే ఆరోపణల నేపథ్యంలో అక్రిడేషన్‌ను పొడిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఇది మూడోసారి.  కాగా తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో మీడియా అకాడమీ చైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్టు శ్రీనివాస్‌ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అక్రిడేషన్‌ కార్డుల జారీలో నూతన మార్గదర్శకాలను ప్రవేశపెట్టే ఉద్దేశంతో అక్రిడేషన్ల జారీని పొడిగిస్తూ వస్తున్నారు. కాగా తెలంగాణలోనూ పొడిగించిన అక్రిడేషన్‌ జూన్‌ 30తో ముగియనుంది. అప్పటికైనా కొత్త అక్రిడేషన్లు జారీ చేస్తారా? మరోసారి పొడిగిస్తారా? అనే అంశంలో క్లారిటీలేదు.

Also Read: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌‌కి శిక్ష ఏంటో తెలుసా?

ఏపీలో ఈ నెల 31తో గడువు ముగియ నుండటంతో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును జూన్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కార్డుల జారీ సమయం లేదా ఆగస్టు 31, ఏది ముందైతే అప్పటి వరకు పొడిగింపు వర్తిస్తుందని డైరెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు.. రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్‌ కార్డుల గడువు ఈ నెలతో ముగుస్తున్న నేపథ్యంలో వాటి కాల పరిమితిని మరో మూడు నెలలపాటు  పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ పొడిగింపు జూన్‌ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు లేదా కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలయ్యే వరకు ఉంటుందని, ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు హిమాన్షు శుక్ల తెలిపారు.

Advertisment
Advertisment