Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' వచ్చేది ఆ ఓటీటీలోకే.. ఎప్పుడంటే?

'డబుల్ ఇస్మార్ట్' ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. దక్షిణాది భాషల డిజిటల్ రైట్స్‌ను రూ.33 కోట్లకు సొంతం చేసుకుంది. థియేట్రికల్‌ రన్‌ తర్వాతే ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమా ఈ రోజే దేశ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే.

New Update
Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' వచ్చేది ఆ ఓటీటీలోకే.. ఎప్పుడంటే?

Double ISmart Movie : రామ్ పోతినేని (Ram Pothineni) - పూరి జగన్నాథ్ (Puri Jagannath) కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'డబుల్ ఇస్మార్ట్' (Double ISmart). లైగర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత పూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ భారీ అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల మధ్య నేడు (ఆగస్టు 15) థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ కోసం భారీస్థాయిలో పోటీ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, 'డబుల్ ఇస్మార్ట్' ఓటీటీ రైట్స్ ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు సొంతం చేసుకుంది.

Also Read : కాలినడకన తిరుమలకు మహేష్ ఫ్యామిలీ.. వీడియో వైరల్..!

దక్షిణాది భాషల్లో డిజిటల్ రైట్స్‌ను రూ.33 కోట్లకు దక్కించుకుంది. అయితే ఒప్పందం ప్రకారం థియేట్రికల్‌ రన్‌ తర్వాతే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. కాగా సినిమాకి సంబంధించి హిందీ డీల్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా.. సంజయ్ దత్ విలన్ రోల్ లో కనిపించారు.

Advertisment
తాజా కథనాలు