Anger Management: మీకు ఎక్కువగా కోపం వస్తుందా..? నివారించాల్సిన ఆహారాలు ఇవే

కోపం అనేక అనర్థాలకు కారణం. కోపాన్ని పెంచే ఫుడ్స్‌ కొన్ని ఉంటాయి. వాటికి దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్స్, మసాలా ఆహారాలు, మద్యం, ప్రాసెస్ ఫుడ్స్‌కి కోపం ఎక్కువగా ఉండేవాళ్లు దూరంగా ఉంటే బెస్ట్.

New Update
Anger Management: మీకు ఎక్కువగా కోపం వస్తుందా..? నివారించాల్సిన ఆహారాలు ఇవే

Anger Management: మనం తీసుకుంటే ఆహారాలు కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలకు కారణమౌతాయి. కొన్ని ఆహారాలు ఆరోగ్య శ్రేయస్సుపై ప్రభావం పడతాయి. మనం తీసుకునే ఆహారాలు మన భావోద్వేగాల మధ్య సంబంధం కాదనలేనిది. అయితే కోపంగా ఉంటే ఆహార ఎంపికల మార్పులు చేసుకోవటం ముఖ్యం. మంన తీసుకునే కొన్ని ఆహారాలు మన భావోద్వేగ ప్రతిస్పందనలను తీవ్రతరం చేసి తిరిగి ప్రశాంతతను పొందాలనుకుంటే ఆహారాలు ఆటంకంగా మారతాయి. కోపంతో ఒత్తిడికి గురైనప్పుడు మనం ఎలాంటి ఆహారాలను తీసుకుంటే ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల అతిసారం, ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆహారం తీసుకోకుండాదో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కోపంగా ఉన్నప్పుడు నివారించాల్సిన ఆహారాలు :
ప్రాసెస్ ఆహారాలు: పాస్తా, వైట్‌బ్రెడ్, పేస్ట్రీలు వంటి ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి , పడిపోవడానికి సహాయపడుతాయి. దీని వలన మానసిక కల్లోలం, చిరాకు, భావోద్వేగ స్థిరత్వం తగ్గి, కోపాన్ని పెంచుతుంది.
మద్యం: కోపం, ఒత్తిడి నుంచి బయటపడటానికి కొందరూ మద్యపానాన్ని తీసుకుంటారు. అయితే మద్యాన్ని తాగటం వలన నిస్పృహ, నిరాశ కలిగి నిర్ణయాధికారాన్ని దెబ్బతీసి ప్రతికూల భావోద్వేగాలను తీవ్రతరం చేస్తుంది.
కెఫిన్ పానీయాలు: కెఫీన్‌ నిద్రపై ప్రభావం పడుతుంది. ఎనర్జీ డ్రింక్స్, బ్లాక్ టీ, కాఫీతోపాటు కొన్ని సోడాలు వంటి పానీయాలు భావోద్వేగాలను పెంచి నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. ఇది ఆందోళన, చిరాకు, చంచలత్వం పెంచుతుంది. కెఫీన్‌ మానసిక స్థితిని మరింత ప్రభావితం ఎక్కువ ప్రభావం పడుతుంది.
ఫాస్ట్ ఫుడ్స్: ఇలాంటి ఫుడ్‌ను ఎక్కువగా తింటే అనారోగ్యకరమైన కొవ్వులు పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో మంట, న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఫాస్ట్ ఫుడ్స్ మానసిక, భావోద్వేగ స్థితిని ప్రభావితం చేసి కోపాన్ని తీవ్రతరం చేస్తుంది.
చక్కెర ఆహారాలు: అధిక చక్కెర తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుంది. కోపంలో ఉంటే చక్కెర పానీయాలు, మిఠాయిలు, చాక్లెట్లు వంటికి ఇవ్వవద్దు. అధిక చక్కెర ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలలో వేగంగా హెచ్చుతగ్గులకు దారితీసి మూడ్ స్వింగ్‌లు, చిరాకు వచ్చేలా చేస్తుంది.
మసాలా ఆహారాలు: కోపంగా ఉన్నప్పుడు కారంగా ఉండే ఆహారాలు ఇవ్వవద్దు. అందులో ఉంటే ఉష్ణోగ్రతలు కోప్పాన్ని ఎక్కువ వచ్చేలా చేస్తుంది.దీని వలన కొంతమంది వ్యక్తులలో కోపం, ఒత్తిడిగా ఉంటే మసాలా ఫుడ్‌ జీర్ణ అసౌకర్యాన్ని కలిగిస్తాయి, నిరాశ, చిరాకు వచ్చేలా చేస్తుంది.
ఇది కూడా చదవండి: వేయించిన పల్లీలు రోజూ తింటున్నారా..? అయితే లాభాలు చూడండి

Advertisment
తాజా కథనాలు