Telangana: డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. అది నిజమేనా?!

తెలంగాణ ఎన్నికల్ల కౌంటింగ్ నేపథ్యంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్వయంగా కేసీఆరే డీల్ చేస్తున్నారని ఆరోపించారు.

Telangana: డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. అది నిజమేనా?!
New Update

DK Shiva Kumar: మరికొన్ని గంటల్లో తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తమ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడుతున్నారని ఆయన చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ నేరుగా తమ అభ్యర్థులతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ విషయాన్ని తమ అభ్యర్థులే తెలిపారన్నారు. అయితే.. తమ అభ్యర్థులు ఎవరూ బయటకు వెళ్లరన్నారు. ఇదిలా ఉంటే.. రేపు ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది.

డీకే శివకుమార్ ను ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దించింది. రేపు రిజల్ట్స్ వచ్చిన వెంటనే అభ్యర్థులను క్యాంప్ కు తరలించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు సైతం సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే క్వార్టర్ట్స్ లో ఠాక్రే రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది.

కౌంటింగ్ సమయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి అన్న అంశంపై వీరి భేటీలో చర్చ జరుగుతోంది. మరో వైపు బీఆర్ఎస్ నేతలు సైతం గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఫలితాలు తప్పకుండా తమకు అనుకూలంగానే ఉంటాయని.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తనను కలిసిన నేతలతో కేసీఆర్ చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ కూడా ఇదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుపాను ఎఫెక్ట్‌.. 142 ట్రైన్స్ రద్దు..

కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, 144 సెక్షన్..

#telangana-elections #dk-shiva-kumar #telangana-news #telangana-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe