AP News: ఎద్దుల పందెంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జనం భారీ సంఖ్యలో వేడుకకు హాజరుకావడంతో వారి అరుపులకు బెదిరిపోయిన ఓ ఎద్దు జనంపైకి తిరగబడింది. ఈ క్రమంలోనే ఓ యువకుడిని పొడిచి చంపింది. మరొక వ్యక్తిని తన కొమ్ములతో తీవ్రంగా గాయపరచగా.. ఈ దాడిలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Bull Race: ఎద్దుల పందెంలో అపశృతి.. యువకుడిని పొడిచి చంపిన బాహుబలి ఎద్దు!
గంగ జాతర పురస్కరించుకొని తిరుపతి జిల్లా కొట్టాలలో నిర్వహించిన ఎద్దుల పోటీలో అపశృతి చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి వచ్చిన బాహుబలి ఎద్దు జనంపైకి తిరగబడి దిలీప్ కుమార్ అనే వ్యక్తిని పొడిచి చంపింది. స్థానిక ఎస్సై రామాంజనేయులు ఎద్దుల పోటీని తాత్కాలికంగా నిలిపేశారు.
Translate this News: