/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bhatti-Vikramarka-2.jpg)
Bhatti Vikramarka: ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రజా భవన్ లో బ్యాంకర్స్ తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించనున్నారు. రుణమాఫీ (Runa Mafi) గురించి బ్యాంకర్లతో చర్చించనున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు.. మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచించనున్నారు. రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్న భట్టి విక్రమార్క. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, తదితరులు హాజారుకానున్నారు.
Also Read: డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలి.. హైకోర్టుకు నిరుద్యోగులు