AP: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు

ఏలూరు జిల్లా దెందులూరులో టీడీపీకి షాక్ తగిలింది. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో దెందులూరు నియోజకవర్గ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు వైసీపీలో చేరారు.

New Update
AP: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు

TDP Candidates Joined in YCP: ఏలూరు జిల్లా దెందులూరులో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. నియోజకవర్గంలోని టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు వైసీపీలో చేరారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు చలుమోలు అశోక్ గౌడ్, పీసీసీ జనరల్ సెక్రెటరీ, దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా పని చేసిన డివిఆర్కే చౌదరి, ఇతర దెందులూరు నియోజకవర్గ కీలక నేతలు వైసీపీ గూటికి చేరుకున్నారు.

Also Read: ఉండి టీడీపీ టికెట్ RRRకు?.. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సంచలన ఇంటర్వ్యూ!

Advertisment
తాజా కథనాలు