Farmers Protest : హస్తినలో హైటెన్షన్.. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్‌!

'ఢిల్లీ చలో'ను ప్రారంభించిన భారతీయ రైతులపై పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించడంతో శంభు సరిహద్దు వద్ద ఆందోళనకరమైన దృశ్యాలు కనిపిస్తునాయి. డిమాండ్లలో MSP చట్టంతో పాటు రుణ ఉపశమనం ఉన్నాయి. అటు రైతుల ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో పలు స్టేషన్లను మూసివేసింది.

Farmers Protest : హస్తినలో హైటెన్షన్.. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్‌!
New Update

Delhi Chalo Updates : రానున్న లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha Elections) రైతుల ఆందోళనలు కేంద్రాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ట్రాక్టర్ ట్రాలీ ప్రవేశాన్ని అరికట్టేందుకు ఢిల్లీ(Delhi) పోలీసులు సెక్షన్ 144ను అమలు చేయడంతో ఎన్‌సీఆర్(NCR) సరిహద్దుల వెంబడి అధిక భద్రతా చర్యలు స్పష్టంగా ఉన్నాయి. 2000 మంది సిబ్బందితో అప్రమత్తమైన దళం పరిస్థితిని పర్యవేక్షిస్తుంది.

Also Read : CM Revanth Reddy : మేడిగడ్డ కూలిందా.. కూల్చేశారా తేల్చేద్దాం పదండి : రేవంత్ రెడ్డి

టియర్ గ్యాస్‌ ప్రయోగించిన పోలీసులు:

పంజాబ్‌-హర్యానా(Punjab-Haryana) శంభు సరిహద్దు వద్ద రైతులు ఢిల్లీకి రాకుండా టియర్‌ గ్యాస్‌(Tear Gas) ప్రయోగించారు. నిరసన తెలుపుతున్న రైతులు సరిహద్దులకు చేరుకోవడంతో ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీ భద్రతను మోహరించారు. వేలాది మంది రైతులు దేశ రాజధాని వైపు 'ఢిల్లీ చలో' నిరసన కవాతును ప్రారంభించారు. దీంతో రైతులను హస్తినలో ప్రవేశించకుండా నిరోధించడానికి ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల సరిహద్దుల వెంబడి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు.



రైతుల ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో(Delhi Metro) పలు స్టేషన్లను మూసివేసింది. రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, ఉద్యోగ్ భవన్ స్టేషన్ మూసివేయబడ్డాయి, జనపథ్, బరాఖంబ రోడ్ మెట్రో స్టేషన్లు మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మెట్రో స్టేషన్ల గేట్లను క్లోజ్ చేశారు. మిగిలిన అన్ని మెట్రో స్టేషన్లు సాధారణంగా రన్ అవుతాయి.

Also Read : RTV ఎక్స్‌క్లూజివ్.. దెయ్యంతో ఒక రాత్రి.. అసలు కాండ్రకోటలో ఏం జరుగుతోంది..!

#2024-lok-sabha-elections #farmers-protest #delhi-chalo
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe