Death Threat to Rahul Gandhi : కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని వార్త టెన్షన్ పెడుతోంది. రాహుల్ గాంధీపై ఆయన తండ్రి రాజీవ్గాంధీ(Rajiv Gandhi) పై బాంబు దాడి జరిగినట్టే జరగొచ్చని మహారాష్ట్ర(Maharashtra) లోని నాసిక్ పోలీసులకు సమాచారం అందింది. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ రాహుల్ నివాసానికి భద్రతను పెంచింది. అలాగే రాహుల్ గాంధీకి భద్రతను కట్టుదిట్టం చేయాలని ఢిల్లీ పోలీసులు, యూపీ, మధ్యప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం రాహుల్ గాంధీకి జెడ్ ప్లస్ భద్రత ఉంది. ఆయన న్యాయ్ జోడో యాత్ర ఇవాళ(మార్చి 2) మధ్యప్రదేశ్లోకి ఎంట్రీ ఇస్తుంది. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 24 అక్బర్ రోడ్లోని ఆయన నివాసానికి భద్రత పెంచినట్లు ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయన నివాసం దగ్గర పెట్రోలింగ్ను పెంచారు. సాధారణ దుస్తుల్లో పోలీసులను మోహరించారు.
పూర్తిగా చదవండి..BREAKING : రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు.. అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీపై బాంబుదాడి జరిగే అవకాశం ఉందని మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీ, మహారాష్ట్ర పోలీసులు అలెర్ట్ అయ్యారు. అటు హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 24 అక్బర్ రోడ్లోని ఆయన నివాసానికి భద్రత పెంచినట్టుగా తెలుస్తోంది.
Translate this News: