Srikakulam: అమెరికాలో ఇచ్చాపురం యువకుడి దుర్మరణం!

అమెరికాలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన యువకుడు రూపక్‌ రెడ్డి ప్రమాదవశాత్తు చనిపోయాడు. స్నేహితులతో కలిసి లేక్ వద్దకు వెళ్లి అక్కడ ఫోటోలు దిగుతున్న క్రమంలో అదుపు తప్పి లేక్‌ లో పడిపోయాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ స్నేహితులు అతనిని కాపాడలేకపోయారు.

Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
New Update

Srikakulam: ఉన్నత చదువలు కోసం అమెరికా వెళ్లిన శ్రీకాకుళం జిల్లా యువకుడు అక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. జిల్లాలోని ఇచ్చాపురం పట్టణానికి చెందిన పెదిని రూపక్‌ రెడ్డి (26) 8 నెలల కిందట అమెరికా వెళ్లాడు. డెలవేర్‌ లో నివసిస్తూ హారిస్‌ బర్గ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఎంఎస్‌ చదువుతున్నాడు.

మంగళవారం సాయంత్రం రూపక్‌ రెడ్డి తన స్నేహితులతో కలిసి స్థానిక జార్జ్‌ లేక్‌ కు వెళ్లారు. అక్డ బోటు పై షికారు చేస్తూ సరస్సు మధ్యలో ఉన్న రాయి పై ఎక్కి ఫోటోలు దిగుతున్న క్రమంలో రూపక్‌ ఒక్కసారిగా పట్టుతప్పి నీటిలోకి జారిపడిపోయాడు. అతని స్నేహితులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కాపాడలేకపోయారని రెస్క్యూ బృందం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ విషయాన్ని రూపక్‌ స్నేహితులు ఫోన్ ద్వారా తెలియజేశారు.

Also Read: తెలంగాణలో 31 కొత్త ఎఫ్‌ఎం స్టేషన్లకు పచ్చ జెండా!

#lake #dead #echchcapuram #youngmen #america
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe