/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-1-42.jpg)
జూన్ 25న జరగాల్సిన సీఎస్ఐఆర్ యజీసీ నెట్ పరీక్ష వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల ఈ పరీక్షను పోస్ట్పోన్ చేస్తున్నామని ఎన్టీయే తెలిపింది.
ప్రస్తుతం ఎన్టీయే చాలా వివాదాల్లో ఇరుక్కుంది.రీసెంట్గా యూజీసీ నెల, నీట్ పరీక్షల్లో అవతవకలు జరగడం..నెట్ ఎగ్జామ్ వాయిదా పడడంతో చాలా గొడవలు జరుగుతున్నాయి. నెట్ ఎగ్జామ్ జరిగిన మర్నాడే దాన్ని వాయిదా వేశారు. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తామో త్వరలోనే చెబుతామని చెప్పారు. మరోవైపు నీట్ ఫలితాలు, పేపర్ లీక్ మీద సుప్రీకోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షను కూడా పోస్ట్పోన్ చేస్తున్నామని ఎన్టీయే ప్రకటించింది. అనివార్యకారణల వల్ల ఎగ్జామ్ను నిర్వహించలేకపోతున్నామని తెలిపింది. మళ్ళీ ఈ పరీక్షను ఎప్పుడు పెడతారన్న వివరాలు కూడా తెలపలేదు. జూన్ 25 నుంచి 27 వరకు సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష జరగాల్సి ఉంది.
NTA postponed the Joint CSIR-UGC-NET Examination June 2024 which was scheduled to be held between June 25 to 27. It is being postponed due to unavoidable circumstances as well as logistic issues. The revised schedule for the conduct of this examination will be announced later… pic.twitter.com/cJknD7OHBb
— ANI (@ANI) June 21, 2024