Supreme Court : అత్యాచార బాధితురాలి అబార్షన్‌కు అనుమతిస్తూ సుప్రీకోర్టు కీలక నిర్ణయం..!!

అత్యాచార బాధితురాలి అబార్షన్ కు అనుమతిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థలో గర్భం దాల్చడం దంపతులకు ఆనందం ఇస్తుందని సుప్రీం తెలిపింది. కానీ ఒక స్త్రీ తన ఇష్టానికి విరుద్ధంగా గర్భవతి అయినప్పుడు..అది ఆమె మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. గుజరాత్‌కు చెందిన అత్యాచార బాధితురాలికి అబార్షన్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 19న, ఈ అంశంపై విచారణ సందర్భంగా, గుజరాత్ హైకోర్టు వైఖరిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మెడికల్ బోర్డు నుండి తాజా నివేదికను కోరింది.

New Update
Supreme Court : అత్యాచార బాధితురాలి అబార్షన్‌కు అనుమతిస్తూ సుప్రీకోర్టు కీలక నిర్ణయం..!!

Supreme Court: గుజరాత్‌కు చెందిన అత్యాచార బాధితురాలి అబార్షన్ కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది . భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థలో గర్భం దాల్చడం దంపతులకు, సమాజానికి ఆనందాన్ని కలిగిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే, ఒక స్త్రీ తన ఇష్టానికి విరుద్ధంగా గర్భవతి అయినప్పుడు, అది ఆమె మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది.

బాధితురాలి మెడికల్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు బివి నాగరత్న(BV Nagarthana), ఉజ్జల్ భుయాన్‌ల(Ujjal Bhuyan)తో కూడిన ధర్మాసనం అబార్షన్ కోసం బాధితులు చేసిన అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించడం సరికాదని పేర్కొంది. అంతకుముందు ఆగస్టు 19న, ఈ అంశంపై విచారణ సందర్భంగా, గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) వైఖరిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మెడికల్ బోర్డు నుండి తాజా నివేదికను కోరింది. ఈ అంశంపై గుజరాత్ హైకోర్టు విచారణకు చాలా సమయం తీసుకుందని కోర్టు పేర్కొంది.

సమాచారం ప్రకారం, బాధితురాలి వయస్సు 25 సంవత్సరాలు. ఆమె అబార్షన్ కోసం సుప్రీంకోర్టులో (Supreme Court) దరఖాస్తు చేసింది . ప్రభుత్వ విధానం, మెడికల్ రిస్క్ కారణంగా బాధితురాలి పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను బాధితురాలు సుప్రీంకోర్టులో సవాలు చేయగా, దానిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అత్యాచార బాధితురాలికి అబార్షన్ చేయవద్దని గుజరాత్ హైకోర్టు శనివారం (ఆగస్టు 19) ఆదేశించిన సంగతి తెలిసిందే.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గుజరాత్ హైకోర్టు ఏం చేస్తోందంటూ సుప్రీంకోర్టు ఘాటైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టు నేటి తేదీని నిర్ణయించినప్పుడు, హైకోర్టు ఎందుకు తీర్పు ఇచ్చింది? ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. పిండం సజీవంగా ఉన్నట్లు తేలితే, పిండం బతికేందుకు ఇంక్యుబేషన్ సహా అవసరమైన అన్ని సహాయాన్ని ఆసుపత్రి అందించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టం ప్రకారం బిడ్డను దత్తత తీసుకునేలా రాష్ట్రం చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం గుజరాత్ హైకోర్టులో ఏం జరుగుతోంది? భారతదేశంలోని ఏ కోర్టు కూడా హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇవ్వదు. ఇది రాజ్యాంగ విరుద్ధం’’ అని అన్నారు.గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, క్లరికల్ లోపాన్ని సరిదిద్దేందుకు శనివారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గత ఆర్డర్‌లో క్లరికల్ లోపం ఉందని, దానిని శనివారం సరిదిద్దామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంగా, ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తామని తెలిపారు.

Also Read: కావాలంటే చింపాంజీ చెప్పిన సందేశం వినండి… ఆనంద్ మహీంద్ర అద్బుతమైన ట్వీట్….!

Advertisment
తాజా కథనాలు