AP Road Accident: కన్నీరు తెప్పించే విషాదం.. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి!
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్కు చెందిన గన్ను మాధవకృష్ణ (48), సరిత సుమంగళి(43)గా గుర్తించారు. ఈ ఘటన పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట దగ్గర జరిగింది.