/rtv/media/media_files/2025/06/04/3UTZu6YU9drixNSePQ3E.jpg)
RCB విక్టరీ పరేడ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి, 52 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 18 ఏళ్ల తరువాత ఆర్సీబీ కప్ గెలవడంతో భారీ సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి వచ్చారు. దీంతో స్టేడియం వద్ద సరైన సమయానికి గేట్లు తెరవకపోవడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. అభిమానులు ముందున్న వాళ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. దీంతో తొక్కిసలాట జరగగా 11 మంది చనిపోయారు. గాయపడిన వారిని బౌరింగ్ ఆసుపత్రి, మాల్యా రోడ్డులోని వైదేహి ఆసుపత్రిలో కూడా చేర్చారు. బౌరింగ్ ఆసుపత్రిలో 7 మంది, వైదేహి ఆసుపత్రిలో 3 మంది మరణించారు.
Its not worldcup. Why is it so important to have a club win? Totally unacceptable. Shameful pic.twitter.com/iPNx1ftz9O #Stampede #RCB #chinnaswamystadium #Kohli
— Chanthappan (@chanthppan) June 4, 2025