ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!

ప్రేమను నిరాకరించిందని ఇంటర్ విద్యార్థిని నోట్లో పురుగుల మందుపోసి చంపిన ఘటన కర్నూల్ జిల్లా నగరూర్ గ్రామంలో చోటుచేసుకుంది. అశ్విని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డ సన్నీ పారిపోగా పోలీసులు గాలిస్తున్నారు.  

New Update
ser se

AP Crime: ఏపీలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనతో చదువుకుంటూ స్నేహంగా ఉంటున్న అమ్మాయి తన ప్రేమ నిరాకరించిందని దారుణానికి పాల్పడ్డాడు. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే కక్షతో అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘోరమైన సంఘటన 
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామంలో చోటు చేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: సైబర్ స్కామ్.. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మహిళ బట్టలు విప్పించి..!

కర్నూల్ జిల్లా కేంద్రలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అశ్విని అనే అమ్మాయిని సన్నీ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తున్నాడు. కానీ సన్నీ ప్రేమను అశ్విని నిరాకరిస్తోంది. తనకు ఇష్టం లేదని, ఇలాంటి పనుల వల్ల చదువు డిస్ట్రబ్ అవుతుందని నచ్చజేప్పేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ సన్నీ తన ప్రవర్తను మార్చుకోకపోగా.. మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అశ్విని గట్టిగా మందలించింది. ఈ క్రమంలోనే అశ్వినిపై పగ పెంచుకున్న సన్నీ.. అశ్విని ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరబడి దారుణం చేశాడు. 

ఇది కూడా చదవండి: TN: హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ

ఒంటరిగా ఉన్న అశ్విని నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పారిపోయాడు. అయితే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అశ్వినిని గుర్తించిన బంధువులు ఆస్పత్రికి తరలించేలోపే అశ్విని మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. పరారిలో ఉన్న సన్నీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: సిన్వర్‌ చనిపోయే ముందు డ్రోన్ ఫొటేజ్.. వైరల్ అవుతున్న వీడియో

ఇది కూడా చదవండి: వివాదంలో ఇరక్కున్న సీఎం కుమారుడు.. ఏం చేశాడంటే ?

Advertisment
Advertisment
తాజా కథనాలు