Hyderabad: దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అర్థరాత్రి ఆటోలో అత్యాచారం

హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆర్‌సీపురం వద్ద ఆటో ఎక్కి అర్థరాత్రి 2 గంటల సమయంలో మసీద్ బండ దగ్గర దిగిన యువతిపై అత్యాచారం చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

New Update

Hyderabad: రాష్ట్రంలో అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిన్న, పెద్ద అని తేడా లేకుండా యువకులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్‌సీ పురం దగ్గర ఓ యువతి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో అర్థరాత్రి ఆర్‌సీపురం దగ్గర ఆటో ఎక్కి 2:30 సమయంలో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. 

ఇది కూడా చూడండి: Kidnap : మద్యం దుకాణం లాటరీ వచ్చిందనుకునే లోపే ...కిడ్నాప్‌ అయ్యాడు!

ఇద్దరు యువకులు కలిసి..

ఆ ప్రాంతానికి యువతి చేరిన తర్వాత ఆటో ఆపిన డ్రైవర్, మరో యువకుడు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో దుండుగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి ఆమెను అక్కడే వదిలేసి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. బాధితురాలు వెంటనే గచ్చిబౌలి స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Ap Govt:వారిపై చంద్రబాబు సర్కార్ సీరియస్.. రంగంలోకి ఇంటెలిజన్స్!

ఇదిలా ఉండగా ఏపీలో కూడా కొందరు యువకులు అత్తాకోడళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. పొట్టకూటి కోసం వలస వచ్చిన ఓ కుటుంబంపై గంజాయి మత్తులో ఉన్న మృగాలు దాడి చేశారు. నిర్మాణంలో ఉన్న పేపర్‌ మిల్లులో పనిచేస్తున్న వాచ్‌మన్‌ కుటుంబంలోని అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలిసిందే. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో శుక్రవారం జరిగిన ఈ దారుణ ఘటన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. 

ఇది కూడా చూడండి: ఉదయం లేవగానే ఈ వస్తువులను చూశారంటే.. శని మీ చుట్టూ వైఫైలా తిరుగుతుంది!

పేపన్ మిల్లు పక్కనే ఆ వాచ్‌మ్యాన్ భార్య, కుమారుడు, కోడలు నివసిస్తున్నారు. అక్కడికి ద్విచక్రవాహనాలపై వెళ్లిన ఆరుగురు దుండగులు వాచ్‌మన్‌ను తాగడానికి నీరు అడిగారు. ఇంతలో భార్య, కుమారుడు, కోడలు బయటికి రాగా.. వారిని కొట్టి అత్తాకోడళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

ఇది కూడా చూడండి:  BIG BREAKING: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

Advertisment
Advertisment
తాజా కథనాలు