/rtv/media/media_files/2025/05/29/22AYsNiXYgvn09jVghWb.jpg)
గుజరాత్లో ఓ ప్రేమ జంట పారిపోయేందుకు ఓ వృద్ధుడిని హత్య చేసి దృశ్యం సీన్ ను రిపీట్ చేశారు. చివరికి పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జఖోట్రాకు చెందిన వివాహిత గీతా అహిర్(22)కు భరత్ (21)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. దీంతో వీరిద్దరూ దూరంగా వెళ్లి బతకాలని అనుకున్నారు. లేచిపోతే కచ్చింతగా దొరికిపోతామని గీత స్కెచ్ వేసింది. తెలుగుతో పాటుగా ఇతర బాషల్లో బాగా పాపులర్ అయిన దృశ్యం సినిమాను ప్రేరణగా తీసుకుని తాను చనిపోయినట్టుగా ఓ సీన్ క్రియేట్ చేసి ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంది. ప్లాన్ ప్రకారం రోడ్డుపై వెళ్తున్న ఓ వృద్ధుడికి భరత్ లిప్ట్ ఇచ్చాడు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాక అతన్ని కత్తితో పొడిచి చంపేశాడు.
సగం కాలిన శవాన్ని
ఓ రాత్రి అతన్ని శవాన్ని చెరువు వద్దకు తీసుకువెళ్లారు. అదే రోజు రాత్రి ఇంట్లో నుంచి పెట్రోల్ తీసుకుని బయటకు వచ్చిన గీత వృద్ధుడి మృతదేహానికి గీత దుస్తులు, పట్టీలు తొడిగి పెట్రోల్ తో తగలబెట్టారు. మర్నాడు ఉదయం సగం కాలిన శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తన భార్య కనిపించడం లేదంటూ గీత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెరువు దగ్గర కనిపించిన ఓ శవానికి గీత దుస్తులు, పట్టీలు కనిపించడంతో అది చూసి గీత భర్త ఇది తన భార్య శవమేనని భావించారు. కానీ పోలీసుల విచారణలో అది పురుషుడి డెడ్ బాడీ అని తేలింది. రాజస్థాన్కు పారిపోయే ముందు పాలన్పూర్ రైల్వే స్టేషన్లో ఈ ప్రేమ జంట పట్టుబడింది. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.