Crime: కొత్త ఫోన్ కొన్నందుకు పార్టీ ఇవ్వలేదని. స్నేహితులు ఏం చేశారంటే?

దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన జరిగింది. కొత్త ఫోన్ కొన్నందుకు పార్టీ ఇవ్వలేదని స్నేహితుడిని కత్తితో హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కత్తిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

author-image
By Kusuma
New Update
Khammam Student: అగ్రరాజ్యంలో తెలంగాణ విద్యార్థి పై దాడి..పరిస్థితి విషమం!

ఈ తరం యువత చిన్న విషయాలకు గొడవలు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఫోన్ కొన్నందుకు పార్టీ ఇవ్వలేదని స్నేహితుడిని హతమార్చిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని షకర్‌పూర్‌లో నివసిస్తున్న సచిన్ అనే యువకుడు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకున్నాడు. దీంతో ఒంటరిగా షాప్‌కు వెళ్లకుండా తన స్నేహితుడిని తీసుకుని వెళ్లాడు. ఫోన్ కొన్న తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వస్తుంటే దారి మధ్యలో ముగ్గురు స్నేహితులు కలిశారు. సచిన్ దగ్గర ఉన్న కొత్త ఫోన్ చూసి పార్టీ అడిగారు. 

కత్తితో పొడిచి..

పార్టీ ఇవ్వడానికి సచిన్ నిరాకరించడంతో స్నేహితులకు తనకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఆ గొడవ తీవ్రం అయ్యి కొట్టుకునే వరకు వెళ్లారు. పార్టీ ఇవ్వలేదని ముగ్గురు యువకుల్లో ఒకడు సచిన్‌ను కత్తితో పొడిచాడు. స్థానికులు సచిన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందుతులు ముగ్గురు మైనర్లు అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత నిందితులు పారిపోయారు. అక్కడ ఉండే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

Also Read :  ఉత్తరప్రదేశ్ ఆహార కేంద్రాలకు కఠిన నియమాలు‌‌..సీఎం యోగి ఆర్డర్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు