Nandyal : నంద్యాల జిల్లాలో దారుణం.. వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు బలి!

నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ నాలుగేళ్ల బాలుడిని వీధికుక్కలు చుట్టుముట్టి కరవడంతో స్పాట్ లోనే చనిపోయాడు. మొహిద్దీన్‌(4) శుక్రవారం సాయంత్రం ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా వీధికుక్కలు అటాక్ చేయడంతో స్పాట్ లోనే చనిపోయాడు.

New Update
attack-dogs

attack-dogs

నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ నాలుగేళ్ల బాలుడిని వీధికుక్కలు చుట్టుముట్టి కరవడంతో స్పాట్ లోనే చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేతంచెర్ల పట్టణంలోని హనుమాన్‌నగర్‌ కాలనీలో నివసం ఉంటున్న  హుస్సేన్‌ బాషా, ఆశ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు మొహిద్దీన్‌(4) 2025 మే  02వ  తేదీ  శుక్రవారం సాయంత్రం మరో బాలుడితో కలిసి ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు.

చిన్నారులు పరుగెత్తినా

అయితే  ఇదే టైమ్ లో  ఓ కుక్కల గుంపు వీరి దగ్గరికి వచ్చాయి.  వెంటనే ఇద్దరు చిన్నారులు పరుగెత్తినా మొహిద్దీన్‌ మాత్రం కుక్కల దాడికి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు  తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే  మొహిద్దీన్‌ చనిపోయినట్లుగా వైద్యులు నిర్థారించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈఘటన  స్థానికంగా కలకలం రేపింది.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు