/rtv/media/media_files/2026/02/27/chittoor-2026-02-27-12-59-34.jpg)
Chittoor
Chittoor: చిత్తూరు జిల్లా పలమనేరులో విషాద ఘటన జరిగింది. జిమ్లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ యువ బ్యాంక్ ఉద్యోగి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
విశ్వనాథ్ (27) వి.కోటలో ఉన్న డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ప్రతిరోజులాగే ఉదయం జిమ్కు వెళ్లి వ్యాయామం చేశారు. వ్యాయామం ముగిసిన కొద్దిసేపటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అక్కడున్న వారు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Also Read: యూట్యూబ్ తుక్కు రేగ్గొట్టిన నాని 'ఆయా షేర్'.. ఫుల్ లిరిక్స్ ఇదిగో!
Man Dies After Doing Gym
జిమ్లో చేరిన వారానికే బ్యాంకు ఉద్యోగి మృతి
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2026
చిత్తూరు - పలమనేరులోని డీసీసీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తూ.. జిమ్లో వారం కిందట చేరిన విశ్వనాథ్
అయితే ఉదయం జిమ్కి వెళ్లి వర్కౌట్ చేస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వగా.. స్నేహితుడికి ఫోన్ చేసి పిలిపించుకుని కొబ్బరి… pic.twitter.com/RfMd2cRigS
Also Read: అయేషా మీరా కేసు ముగిసిందా .. నిందితులకు శిక్ష పడకపోవడానికి కారణాలేంటి ?
పలమనేరులోని వీరరాఘవయ్య వీధిలో నివసిస్తున్న విశ్వనాథ్కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచింది.
వైద్యుల ప్రాథమిక అంచనా ప్రకారం, అధికంగా వ్యాయామం చేయడం వల్ల గుండెపోటు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండానే ఒక్కసారిగా గుండెపోటు రావడం ఆశ్చర్యకరమని వైద్యులు పేర్కొన్నారు.
Also Read: 'రాకాస'తో నేను కూడా ప్రభాస్ హగ్ తీసుకుంటా: సంగీత్ శోభన్
ఇటీవల వేగంగా బరువు తగ్గాలని, త్వరగా బాడీబిల్డింగ్ చేయాలని కొందరు అధికంగా వ్యాయామం చేస్తున్నారు. సరైన విశ్రాంతి లేకుండా, తగినంత ద్రవాలు తీసుకోకుండా ఓవర్గా జిమ్ చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యం కోసం వ్యాయామం అవసరం కానీ, పరిమితి దాటితే ప్రాణాపాయం కలగవచ్చని సూచిస్తున్నారు.
Follow Us