AP Crime : 8 ఏళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారం.. వృద్ధుడి  గొంతుకోసిన మేనమామ

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 8 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.  అయితే అక్కడ బాలిక మేనమామ  వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. నిందితుడు షేక్ మీరావలి గొంతుకోశాడు.

New Update
west crime

ఏపీలో దారుణం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 8 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.  అయితే అక్కడ బాలిక మేనమామ  వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. నిందితుడు షేక్ మీరావలి గొంతుకోశాడు. వెంటనే పోలీసులు వృద్ధుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మేనమామపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.  స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.  

అన్న భార్యను కిరాతకంగా

అన్న భార్యను కిరాతకంగా చంపాడు ఓ వ్యక్తి. వరసకు వదిన అయిన మహిళను బిమల్ మండల్ దారుణంగా హత్య చేశాడు. ఓ చేతిలో కత్తి, మరో చేతిలో సతి మండల్ తల పట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్‌ బసంతిలోని భరత్‌గఢ్‌లో శనివారం చోటుచేసుకుంది. బిమల్ మండల్ వదిన తల చేతిలో పట్టుకొని రోడ్డుపై వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది. 

Andhra Pradesh | telugu-news | west godavari incident | west godavari crime 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు