/rtv/media/media_files/2024/12/01/oxOOGXtJtJiS0sqDoJ2X.jpg)
Accident: ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ నలుగురి ప్రాణాలు తీసింది. ఓ రోగి ప్రాణాలను కాపాడే క్రమంలో అమాయకుల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. రోడ్డుపై వెళ్తున్న పాదాచారుడిని ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ దుర్గటనలో అక్కడికక్కడే నలుగురు దుర్మరణం చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ భయంకర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇద్దరు డ్రైవర్లతో పాటు..
ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిష్ షా (18) అనే రోగిని కర్నూలు జిల్లా నుంచి తన సొంత గ్రామం బిహార్లోని చంపారన్కు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో జబల్పుర్ -నాగ్పుర్ హైవే (ఎన్హెచ్ 34)పై వెళ్తున్న అంబులెన్స్ ఆదివారం ఉదయం ఓ పాదచారుడిని ఢీకొట్టింది. అనంతరం స్తంభాన్ని బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఆ సమయంలో అంబులెన్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు అనిష్ షా కుటుంబ సభ్యులు ఆరుగురు ఉన్నారు. ప్రమిత షా (35), ప్రిన్స్ షా (4), ముకేశ్ షా (36), సునీల్ షా (40) అక్కడికక్కడే చనిపోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జబల్పుర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.