K Sambasiva Rao: బీజేపీ ఒక త్రాచు పాము.. మోడీ ప్రజలను రెచ్చగొడుతున్నారు!

ప్రధాని మోడీ, బీజేపీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒక త్రాచు పాము లాంటిదని, దీనికి తలతో పాటు తోకలో కూడా విషం ఉంటుందన్నారు. మోడీ మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు.

New Update
K Sambasiva Rao: బీజేపీ ఒక త్రాచు పాము.. మోడీ ప్రజలను రెచ్చగొడుతున్నారు!

BJP MODI: ప్రధాని మోడీ, బీజేపీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒక త్రాచు పాము లాంటిదని, దీనికి తలతో పాటు తోకలో కూడా విషం ఉంటుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం ముగ్దుమ్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాజకీయాల గురించి ఆయన మాట్లాడారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక భారానికి కేసీఆర్ పాపాలే కారణమన్నారు. ఆయనవల్లే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. అలాగే బీజేపీది దేశాన్ని ఖండఖండాలుగా విభజించే రాక్షస, షాడిస్టు ఆలోచన విధానమన్నారు. హిందూ, ముస్లింల విభజన తీసుకొచ్చి రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శ్రీరాముని కళ్యాణం జరగకుండానే శ్రీరామ నవమికి ముందే తలంబ్రాలు పంచడం పాపమని, ముందే తలంబ్రాలు పంచడం అంటేనే ఓట్ల కోసమే అన్నారు. క్రిస్టియన్, ముస్లిం పాలనలో కూడా హిందూలకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఇప్పుడు మోదీ ఏదో ప్రమాదం జరుగుతున్నట్టు ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Advertisment
తాజా కథనాలు