Crime News: దారుణం.. కూతురుతో కలిసి దంపతుల ఆత్మహత్య.. కారణం ఇదే..

కర్ణాటలోని కొడుగు జిల్లాలో దారుణం జరిగింది. ఓ దంపతులు తమ కూతురు(11)తో కలిసి ఓ రిసార్ట్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్థిక సమస్యల వల్లే తాము బలవన్మరణానికి పాల్పడుతున్న ఓ సూసైడ్ నోట్ కూడా రాశారు. బాధితులు కేరళకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

New Update
Crime News: దారుణం.. కూతురుతో కలిసి దంపతుల ఆత్మహత్య.. కారణం ఇదే..

దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక పరిస్థితి, చదువులో ఒత్తిడి ఇలా అనేక రకాల కారణాలతో చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా కర్ణాటకాలోని కోడుగు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ దంపతులు తమ కూతురు(11)తో పాటు ఓ రిసార్టులో ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆర్థిక సమస్యల వల్లే తాము ఆత్మహత్యే చేసుకుంటున్నామని ఓ నోటు కూడా ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు వినోద్ (43), అతని భర్య జుబీ అబ్రహం (37), కుమార్తె జోహన్ (11)గా గుర్తించారు. ఓ ప్రైవేట్ రిసార్టు గదిలో వారి మృతదేహాలు దొరికాయి.

Also read: 54 మంది పోస్టులు ఊస్ట్.. రేవంత్ సంచలనం

అయితే వీళ్లు కేరళలోని కొట్టాయంకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కొడుకు జిల్లా అంటేనే టూరిస్టు ప్రదేశం. ఇక్కడ ఓ అటవీ ప్రాంతంలో ఉన్న ఓ రిసార్టులోకి ఆ బాధితులు శనివారం వచ్చారు. అయితే ఆ తర్వాతి రోజే వారి మృతదేహాలు దోరకడం కలకలం రేపింది. ఆ దంపతులు తమ కూతుర్ని చంపిన తర్వాతే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: సీఎం క్యాంప్ ఆఫీస్ మార్పు!.. MCRHRDకి తరలింపు

Advertisment
తాజా కథనాలు