జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ 2019లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం (ఆగస్టు 2) విచారణ చేపట్టనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సోమ, శుక్రవారాలు మినహా ఇవాళ్టి నుంచి ఈ వ్యాజ్యాన్ని విచారించనుంది. అంతకుముందు బెంచ్లో భాగమైన సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో తాజా ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్లో సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ ఖన్నా కొత్త సభ్యులుగా ఉన్నారు.
పూర్తిగా చదవండి..బంతి సుప్రీంకోర్టులో.. ఆర్టికల్ 370 రద్దుపై నేడు రాజ్యాంగ ధర్మాసనం విచారణ..!!
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ్టి(ఆగస్టు2) నుంచి విచారణ చేపట్టనుంది. గత జూలై 11న, ఆర్టికల్ 370పై విచారణకు ఫ్రేమ్వర్క్ను నిర్దేశించిన సుప్రీంకోర్టు, ఆగస్టు 2 నుంచి రోజువారీ విచారణలను కోరింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్లో అభివృద్ధి, పురోగతి, భద్రత పెరిగినట్టు కేంద్రం వాదిస్తోంది.
Translate this News: