విశాఖ బోటు ప్రమాద బాధితులకు నష్టపరిహరం.!

విశాఖ బోటు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రి సీదిరి అప్పలరాజు 80 శాతం పరిహారంగా చెక్కులు అందజేశారు. ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణకు రూ.150 కోట్లు మంజూరు చేయగా.. స్టీల్ బోట్ల తయారీకి 60 శాతం సబ్సిడీ ఇచ్చారు.

New Update
YCP Seediri Appalaraju 'అలాంటి వారు మాత్రమే పార్టీని వీడుతున్నారు'..మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు..!

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో 40 బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఘటనలో 36 బోట్లు పూర్తిగా కాలిపోగా, మరో 9 పాక్షింగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో మత్స్యకార కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంపై స్పందించిన సీఎం జగన్.. బాధితులకు అండగా నిలిచారు. కాలిపోయిన బోట్ల విలువలో  80% నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు.  హామీ ఇచ్చినట్లే రెండు రోజుల వ్యవధిలోనే జిల్లా కలెక్టర్ ఖాతాకు నిధులు జమచేశారు. ఈ మొత్తాన్ని మంత్రి అప్పలరాజు బాధితులకు అందజేశారు.

Also Read: మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి..!

కాలిపోయిన బోట్ల విలువలో 80 శాతం పరిహారంగా మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. విశాఖ హార్బర్ ప్రమాదానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై ముఖ్యమంత్రి జగన్ వేగంగా స్పందించారని, వెంటనే నిధులు విడుదల చేసి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారని కొనియాడారు. తమ ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణకు రూ.150 కోట్లు మంజూరు చేసిందని, స్టీల్ బోట్ల తయారీకి 60 శాతం సబ్సిడీ అందజేస్తోందని వివరించారు.

Also read: మైనర్ బాలిక నిశ్చితార్థం అడ్డుకున్న ఐసిడిఎస్ సిబ్బంది.!

అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు వాటి విలువలో 80 శాతం చొప్పున రూ.6.45 కోట్లు, పాక్షికంగా కాలిన 18 బోట్లు, ఒక వలకు రూ.67 లక్షల పరిహారంగా అందజేసినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఈ ప్రమాదంలో హమాలీలు, చిరు వ్యాపారులు కూడా నష్టపోయారని గుర్తించి కాలిపోయిన ఒక్కో బోటుకు పది మందికి చొప్పున మొత్తం 490 మందికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు