CM's Breakfast Scheme: ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్.. శుక్రవారం నుంచే ప్రారంభం..

స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్. రేపటి నుంచే(06-10-2023, శుక్రవారం) ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం'ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

New Update
CM's Breakfast Scheme: ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్.. శుక్రవారం నుంచే ప్రారంభం..

CM's Breakfast Scheme in Telangana: స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్. రేపటి నుంచే(06-10-2023, శుక్రవారం) ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం'ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy) తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకారం.. శుక్రవారం నాడు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో ఒక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవులు పూర్తి కాగానే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ఈ పథకంలో భాగంగా పాఠశాలల్లో అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. ఇక ఈ పథకం అమలు, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్లకు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు చూసుకుంటారని విద్యాశాఖ తెలిపింది. ఈ పథకం అమలు కోసం విద్యా శాఖ, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి.

Also Read:

Cholera : ఆ దేశం వెన్నులో వణుకు…100 దాటిన మరణాలు…!!

Pawankalyan: ‘నీ సంగతి చూస్తాం కొడకా అంటూ మెసేజ్‌లు వచ్చాయి’.. పవన్‌ సంచలన వ్యాఖ్యలు!

Advertisment
తాజా కథనాలు