TG News : ఆ రెండు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికచేసిన రేవంత్ సర్కార్!

తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా కొడంగల్, మధిర నియోజవర్గాలను ఎంపిక చేశారు. 20-25 ఎకరాల్లో సమీకృత గురుకులాల సముదాయం ఏర్పాటు చేయనున్నారు.

TG News : ఆ రెండు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికచేసిన రేవంత్ సర్కార్!
New Update

IR School : తెలంగాణ (Telangana) లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Integrated Residencial Schools) ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టివిక్రమార్క (Bhatti Vikramarka), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఇతర అధికారుల సమక్షంలో ఈ స్కూల్స్ ఏర్పాటుపై సుధీర్ఘ చర్చలు జరిపారు. ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఆర్కిటెక్చర్స్ రూపొందించిన పలు నమూనాలను పరిశీలించారు.

ఒకే చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌ (Pilot Project) గా కొడంగల్, మధిర నియోజవర్గాల్లో ఈ స్కూల్లను ఏర్పాటు చేసేదిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దాదాపు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణంలో ఈ సమీకృత గురుకులాల సముదాయం ఏర్పాటు చేయనున్నారు. ఒకే చోట ఈ భవనాలు నిర్మించి మినీ ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read : ఈరోజు ముఖ్యమైన 24 వార్తలు మీకోసం..

#telangana #integrated-residential-schools #cm-revanth
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe