CM Revanth Reddy: వారిపై ఫోకస్ పెట్టండి.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

TG: హైడ్రా పేరు చెప్పి కొందరు బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై సీఎం రేవంత్‌ స్పందించారు. అధికారులు డబ్బులు డిమాండ్‌ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వారిపై ఏసీబీ, విజిలెన్స్‌ ఫోకస్‌ పెట్టాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.

New Update
CM Revanth Reddy: తెలంగాణకు కొత్త గవర్నర్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే!

CM Revanth Reddy: హైదరాబాద్ లో హైడ్రా (Hydra) పేరు చెప్పి భయపెట్టి, బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై సీఎం రేవంత్ స్పందించారు. గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, అటువంటి వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీఎం హెచ్చ‌రించారు. ఇలాంటి వ‌సూళ్ల‌కు పాల్ప‌డే వారిపై ఫోక‌స్ పెట్టాల‌ని ఏసీబీ, విజిలెన్స్ అధికారుల‌ను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.

Also Read: హైడ్రాకు మరిన్ని అధికారాలు.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు!

Advertisment
తాజా కథనాలు