Telangana : 13 దేశాల ప్రతినిధులకు విందు ఇచ్చిన సీఎం రేవంత్‌.. పెట్టుబడులకు ఆహ్వానం

తెలంగాణ సీఎం రేవంత్ 13 దేశాలకు చెందిన ప్రతినిధులకు హైదరాబాద్ లో విందు ఇచ్చారు. బుధవారం రాత్రి కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద ఈ కార్యక్రమం జరగగా.. తమ ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యతలను వివరించారు. పారిశ్రామిక పెట్టుబడుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అతిథులను కోరారు.

New Update
Telangana : 13 దేశాల ప్రతినిధులకు విందు ఇచ్చిన సీఎం రేవంత్‌.. పెట్టుబడులకు ఆహ్వానం

Telangana : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వీదేశీ ప్రతినిధులకు హైదరాబాద్(Hyderabad) లో విందు ఇచ్చారు. బుధవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్(Tomb of Qutub Shahi) ల వద్ద అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక , బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్.. మొత్తం 13 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ అతిథ్యాన్ని స్వీకరించారు.

సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతిథులకు స్వాగతం పలుకుతూ.. కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యతలను వివరించారు. తెలంగాణ(Telangana) లో నూతనంగా ఏర్పడిన తమ ప్రభుత్వం అభయహస్తం పేరుతో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను , మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నీ స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి : AP: ఏపీలో మైనర్ బాలికపై ఆటోడ్రైవర్ హత్యాచారం

అన్ని దేశాలలో సత్సంబంధాలు..
అలాగే అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని, యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలలో సత్సంబంధాలు కొనసాగించటానికి తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో ప్రయత్నిస్తుందని తెలిపారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేయుటకు ముందుకు రావాలని కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జయేష్ రంజన్, హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు