Delhi Air pollution: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని!

వాయు కాలుష్యం పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గత మూడు రోజులతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తగ్గింది

Delhi Air pollution: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని!
New Update

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలను గాలి కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరుసగా నాలుగు రోజుల నుంచి గాలి నాణ్యత క్రమక్రమంగా తగ్గిపోతుంది. సోమవారం ఉదయం 9 గంటలకు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 437 గా ఉందని సీపీసీబీ ప్రకటించింది. అయితే గత మూడు రోజులతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తగ్గింది. వాయు కాలుష్యం పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ సమావేశానికి పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ తో పాటు రవాణా శాఖ, ఢిల్లీ మున్సిపాలిటీ, పోలీసు తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కేంద్రం జారీ చేసిన స్టేజ్‌ - 4 గ్రేడెడ్‌ రెస్పాన్స్ ప్లాన్‌ గురించి చర్చించనున్నారు.

అయితే కేవలం ఆప్‌ ప్రభుత్వం వైఫల్యం వల్లే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని గురించి ఆప్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక కక్కర్‌ స్పందించారు. గత కొంత కాలంగా పంజాబ్‌ లోని పంట వ్యర్థాలను కాల్చడం 50 నుంచి 67 శాతం వరకు తగ్గిందని అధికారులు వెల్లడించారు.

పంట వ్యర్థాలు దహనం అవుతున్న ప్రాంతాలు ఢిల్లీకి 500 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయని...కానీ హర్యానాలోని ప్రాంతాలు మాత్రం కేవలం 100 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. పంజాబ్‌ లో పంట వ్యర్థాలను తగుల బెట్టడంలో ఆప్ విజయవంతం అయితే హర్యానాలో మాత్రం బీజేపీ విఫలమైందని ప్రియాంక కక్కర్‌ విమర్శించారు.

దీని గురించి ఢిల్లీకి చెందిన కొందరు మాట్లాడుతూ..వాయు కాలుష్యం కారణంగా ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉందని పేర్కొన్నారు.

దీంతో పాఠశాలలు కూడా మూతపడ్డాయన్నారు. నగరంలో డీజిల్ వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తూ సీఎం కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోందన్నారు.

Also read: విజయవాడ బస్టాండ్‌ లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురి మృతి

#national #air-pollution #delhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe